సుద్దాల దేవయ్యకు వివేక్​ పరామర్శ

సుద్దాల దేవయ్యకు వివేక్​ పరామర్శ

జగిత్యాల, వెలుగు: జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య భార్య లత జూన్ 5న అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే.  కాగా, మంగళవారం పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకట స్వామి మంగళవారం సుద్దాల దేవయ్య ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు, వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నేత లింగం పేట శ్రీను, నక్క రవీందర్, ఇతర లీడర్లు పాల్గొన్నారు.