ఎండీఎంఏ, గంజాయి అమ్ముతూ నలుగురు అరెస్ట్

ఎండీఎంఏ, గంజాయి అమ్ముతూ నలుగురు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు:  రెండు వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా  ఎండీఎంఏ, ఎండు గంజాయిని తరలిస్తుండగా మేడ్చల్​టాస్క్​ఫోర్స్​అధికారులు సోమవారం పట్టుకున్నారు. మేడ్చల్​ఎక్సైజ్​జిల్లా అధికారి షేక్​ ఫయాజుద్దీన్​తెలిపిన ప్రకారం..  అంబర్​పేట్, ఆకాశ్​నగర్​కి చెందిన సయ్యద్​ఫైజల్(26), షేక్​గౌస్​​(31) కారులో వస్తుండగా బోయిన్​పల్లి చెరువు  కట్ట వద్ద పోలీసులు ఆపి చెక్ చేశారు. 

వారి వద్ద 5 గ్రాముల ఎండీఎంఏ లభించింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా... గోవా నుంచి తెచ్చి సిటీలో ఎక్కువ ధరకు అమ్ముతున్నామని అంగీకరించగా నిందితులపై కేసు నమోదు చేశారు. మరో ఘటనలో... బోయిన్​ పల్లికి చెందిన లవ్​ప్రీత్​సింగ్​ (26), పురానాపూల్​కి చెందిన సోమరాజ్​సింగ్​(36)  ఇద్దరు హస్మత్​ పేట్​కూరగాయల మార్కెట్​వద్ద యాక్టివా పై వస్తుండగా సమాచారం మేరకు పోలీసులు ఆపి తనిఖీ చేయగా 290 గ్రాముల ఎండు గంజాయి దొరికింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.