జీడిమెట్ల, వెలుగు: రెండు వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా ఎండీఎంఏ, ఎండు గంజాయిని తరలిస్తుండగా మేడ్చల్టాస్క్ఫోర్స్అధికారులు సోమవారం పట్టుకున్నారు. మేడ్చల్ఎక్సైజ్జిల్లా అధికారి షేక్ ఫయాజుద్దీన్తెలిపిన ప్రకారం.. అంబర్పేట్, ఆకాశ్నగర్కి చెందిన సయ్యద్ఫైజల్(26), షేక్గౌస్(31) కారులో వస్తుండగా బోయిన్పల్లి చెరువు కట్ట వద్ద పోలీసులు ఆపి చెక్ చేశారు.
వారి వద్ద 5 గ్రాముల ఎండీఎంఏ లభించింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా... గోవా నుంచి తెచ్చి సిటీలో ఎక్కువ ధరకు అమ్ముతున్నామని అంగీకరించగా నిందితులపై కేసు నమోదు చేశారు. మరో ఘటనలో... బోయిన్ పల్లికి చెందిన లవ్ప్రీత్సింగ్ (26), పురానాపూల్కి చెందిన సోమరాజ్సింగ్(36) ఇద్దరు హస్మత్ పేట్కూరగాయల మార్కెట్వద్ద యాక్టివా పై వస్తుండగా సమాచారం మేరకు పోలీసులు ఆపి తనిఖీ చేయగా 290 గ్రాముల ఎండు గంజాయి దొరికింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.