గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్

గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్

శంషాబాద్/గండిపేట, వెలుగు: గంజాయిని తరలిస్తున్న నలుగురిని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్ దేవ్ పల్లి డివిజన్ లోని లక్ష్మిగూడ సమీపంలో బుధవారం ఆటోలో వెళ్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు గంజాయి అమ్ముతున్న ఠాకూర్ అర్జున్ సింగ్ అనే వ్యక్తిని సైతం అరెస్ట్ చేశారు. అతడి నుంచి మూడున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.