రెండు ట్రక్కులు ఢీ..నలుగురు సజీవదహనం

రెండు ట్రక్కులు ఢీ..నలుగురు సజీవదహనం

రాజస్థాన్ లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అజ్మీర్ జిల్లాలో రెండు ట్రక్కులు డీకొన్న ఘటనలో నలుగురు చనిపోయారు. ఆదర్శ్ నగర్ ఏరియాలో అర్థరాత్రి తర్వాత రెండు ట్రక్కులు ఒకదానినొకటి డీకొన్నాయి. వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో ట్రక్కులు పూర్తిగా కాలిపోయాయి. నలుగురు సజీవ దహనమయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు...  దర్యాప్తు చేస్తున్నారు. హైవే పై నుంచి శిథిలాలను తొలగిస్తున్నారు.