- నలుగురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
- రూ.37.84 లక్షల క్యాష్సీజ్
గచ్చిబౌలి, వెలుగు: ఐపీఎల్మ్యాచ్ లపై ఆన్లైన్బెట్టింగ్నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. సిటీ శివారు బీరంగూడ సింపనీ పార్కులో ఉండే మొగిలిగిద్ద రామకృష్ణగౌడ్(30), అతని అన్న ఉపేందర్ గౌడ్(40) ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్ ప్లాన్ చేశారు. సోను అనే మెయిన్ బుకీ నుంచి సామగ్రి తీసుకుని, బీరంగూడ కమాన్సమీపంలోని ఓ బిల్డింగ్లో ఆన్లైన్ బెట్టింగ్స్టార్ట్ చేశారు. 40 మంది ఫంటర్లతో కలిసి నైస్ 7777, ప్రో వెబ్సైట్ ద్వారా బెట్టింగ్స్దందా కొనసాగిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ముంబై- వర్సెస్ ఢిల్లీ, రాత్రి జరిగిన లక్నో- వర్సెస్గుజరాత్ మ్యాచ్ లపై బెట్టింగ్నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ జోన్ఎస్ఓటీ పోలీసులు, ఆర్సీపురం పోలీసులతో కలిసి బెట్టింగ్ స్థావరంపై దాడి చేశారు.
రామకృష్ణగౌడ్ను పట్టుకుని విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో ఉపేందర్ గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి నుంచి రూ.18.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్కోసం ఉపయోగిస్తున్న బ్యాంక్అకౌంట్లలోని రూ.18.34 లక్షల క్యాష్ను సీజ్ చేశారు. వీరి వద్ద బెట్టింగ్వేస్తున్న గాజులరామారానికి చెందిన డీసీఎం డ్రైవర్ తలారి శ్రీనివాస్(38), తాపీ మేస్త్రి బండి విజయ్కుమార్(44)ను అరెస్ట్ చేశారు. ప్రధాన బుకీ సోనూ, చందానగర్కు చెందిన ఫంటర్అంజి, పటాన్చెరుకు చెందిన చంద్రం, కూకట్పల్లికి చెందిన దోరాలు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీలు, ఏసీపీ, ఇన్ స్పెక్టర్లు పాల్గొన్నారు.