17 రోజులుగా అజ్ఞాతంలోనే నలుగురు ఎమ్మెల్యేలు

17 రోజులుగా అజ్ఞాతంలోనే నలుగురు ఎమ్మెల్యేలు

మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన అనంతరం పత్తాలేకుండా పోయిన నలుగురు ఎమ్మెల్యేల జాడ ఇంకా తెలియడం లేదు. దాదాపు 17 రోజులుగా వారు అజ్ఞాతంలోనే ఉన్నారు. గత నెల 26 రాత్రి ప్రగతి భవన్కు వెళ్లిన ఆ నలుగురు ఆ తర్వాత ఎవరికీ కనిపించలేదు. అయితే అక్టోబర్ 30న సీఎం కేసీఆర్ వారిని తన వెంట మునుగోడు సభకు తీసుకెళ్లారు. అదే రోజు మళ్లీ తన వెంటే వారిని ప్రగతి భవన్కు తీసుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఈ నెల 4న నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ నుంచి మంత్రి ఎర్రవెల్లి ఫాం హౌస్ కు తరలించినట్లు సమాచారం. గత నెల 26 నుంచి పార్టీ నేతలెవరూ ఆ నలుగురిని కలవకుండా సీఎం కేసీఆర్ కట్టడి చేసినట్లు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యేలను ఎందుకు అజ్ఞాతంలో ఉంచారన్న దానిపై సొంత పార్టీ నేతల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఎవరిని కదిపినా నలుగురు ఎమ్మెల్యేల గురించే చర్చ నడుస్తోంది.