క‌రోనా సోకి నాలుగు నెల‌ల ప‌సికందు మృతి

క‌రోనా సోకి నాలుగు నెల‌ల ప‌సికందు మృతి

సూర్యాపేట జిల్లాకు చెందిన నాలుగు నెలల బాబు క‌రోనా వైర‌స్ సోకి మృతి చెందాడు. ‌ సూర్యాపేట స‌మీపంలోని కాసరబాద గ్రామానికి చెందిన నాలుగు నెల‌ల చిన్నారి ఆరోగ్యం బాగోలేక పోవ‌డంతో ఆ బాబు త‌ల్లిదండ్రులు మంగ‌ళ‌వారం అత‌న్ని హైద‌రాబాద్ లోని నీలోఫ‌ర్ చిన్న‌పిల్ల‌ల ఆస్ప్ర‌త్రికి తీసుకెళ్లారు. అనుమానంతో అక్క‌డి వైద్యులు క‌రోనా టెస్టు చేయ‌గా.. ఆ బాబుకి పాజిటివ్ అని తేలింది. బుధ‌వారం చికిత్స అందించే స‌మ‌యంలో ఆ చిన్నారి గుండె కి రంధ్రం ఉన్న‌ద‌ని , క‌రోనా వైర‌స్ సోక‌డంతో శ్యాస తీసుకోలేక మ‌ర‌ణించాడ‌ని వైద్యులు తెలిపారు.

కాసరబాద గ్రామానికి చెందిన ఆ చిన్నారి త‌ల్లి ప్ర‌స‌వం కోసం కోసం ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఏపూర్ లోని పుట్టింటికి వెళ్లింది. డెలివ‌రీ అయిన నాలుగు నెల‌ల త‌ర్వాత ఆమె కాస‌ర‌బాద గ్రామానికి వ‌చ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం ఆ ప‌సివాడికి జ్వ‌రం రావ‌డంతో స్థానిక ఆస్పత్రిలో చూపించారు. జ్వ‌రం త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆ బాబును మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లోని నీలోఫ‌ర్ చిన్న‌పిల్ల‌ల ఆస్ప్ర‌త్రికి తీసుకెళ్లగా అక్క‌డ పాజిటివ్ అని తేలింది. వైర‌స్ కార‌ణంగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఆ చిన్నారి మ‌ర‌ణించాడు.బాబు త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరు గా విల‌పిస్తున్నారు.

corona death