కడపలో ఘోరం..నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం

కడపలో ఘోరం..నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం

కడప ఎయిర్ పోర్టు సమీపంలో ఇవాళ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ ను సుమో ఢీ కొనడంతో నలుగురు అక్కడిక్కడే సజీవ దహనం అయ్యారు.  మరో  ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  కడప నుంచి అనంతరపురం ఎర్రచందనం తరలిస్తున్న స్కార్పియో ఎయిర్ పోర్టు దగ్గరకు రాగానే  టిప్పర్ ను ఢీ కొట్టింది. నేరుగా టిప్పర్ డీజిల్ ట్యాంక్ ను  ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. వెంటనే స్కార్పియోను వెనక నుంచి వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. స్కార్పియోలో ఉన్న నలుగురు సజీవ దహనం కాగా.. కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతులంతా తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లుగా గుర్తించారు.