
మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.. మరిపెడ మండల కేంద్రంలో ఆటో బోల్తా కొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే స్కూల్ దగ్గర ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ నలుగురు మరిపెడ మండలం బావోజిగూడెం గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. వరుసగా ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఆదివారం ( అక్టోబర్ 5 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే ఔటర్ రింగ్ రోడ్ పై వరుసగా ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటనలో ఆరు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.