గృహ‌ప్ర‌వేశానికి వెళ్ళి యజమానిపై దాడి చేసిన హిజ్రాలు

గృహ‌ప్ర‌వేశానికి వెళ్ళి యజమానిపై దాడి చేసిన హిజ్రాలు

హైద‌రాబాద్: ఓ శుభకార్యానికి వెళ్లి, అక్క‌డి యజ‌మాని తాము అడిగినంత ఇవ్వ‌నందుకు వారిపై దాడి చేశారు న‌లుగురు హిజ్రాలు. ఆ య‌జ‌మాని ఫిర్యాదు మేర‌కు పేట్ బ‌షీరాబాద్ పోలీసులు ఆ న‌లుగుర్నీ అరెస్ట్ చేశారు. పేట్ బ‌షీరాబాద్ లోని దూలపల్లి లో ఓ ఇంటి గృహ‌ప్ర‌వేశానికి వెళ్ళిన హిజ్రాలు య‌జమాని‌ అడిగినంత ఇవ్వనందుకు అతనిపై , అతని కుటుంబసభ్యుల పై దాడి చేశారు. ఇంటి పై మట్టి రాళ్ళు వేసి, వారి శరీర భాగాలను అసభ్యంగా చూపిస్తూ గొడవ చేశారు. దీంతో య‌జమాని పోలీసులు ఫిర్యాదు చేయ‌గా.. పోలీసులు కేసు నమోదు చేసి 4 నలుగురు నిందితులను అరెస్టు చేశారు.