ఫ్రీ హెల్త్​క్యాంప్‌‌నకు విశేష స్పందన.. 200 మందికి మెడికల్ టెస్టులు

ఫ్రీ హెల్త్​క్యాంప్‌‌నకు విశేష స్పందన.. 200 మందికి మెడికల్ టెస్టులు

హైదరాబాద్, వెలుగు : రాజ్​భవన్​రోడ్​ సోమాజిగూడలో ఉన్న శ్రీశ్రీ రవిశంకర్​ విద్యామందిర్​స్కూల్‌‌లో ఆదివారం నిర్వహించిన ఫ్రీ హెల్త్​క్యాంప్‌‌నకు విశేష స్పందన లభించింది. ఈ క్యాంప్ నకు సుమారు 200 మంది హాజరై బీపీ, షుగర్, ఇతర టెస్టులు చేయించుకున్నారు. ప్రోగ్రామ్ కు చీఫ్‌‌ గెస్ట్‌‌గా హాజరైన రిటైర్డ్​ఐఏఎస్​ఆఫీసర్, ఫార్మర్​చీఫ్​సెక్రటరీ ఆఫ్​ఏపీ, హోలీస్టిక్​వెల్‌‌నెస్​క్లినిక్​ఫౌండర్​ఎస్​పీ టక్కర్​మాట్లాడుతూ.. ఈ బిజీ కాలంలో ఎంతోమంది బీపీ, షుగర్​వంటి వ్యాధులతో బాధపడుతున్నారని, కానీ చాలా మందికి ఆ విషయం తెలియడం లేదన్నారు. ఇలాంటి హెల్త్​క్యాంప్‌‌లు పెట్టడం వల్ల వారికి ఉపయోగం ఉంటుందన్నారు. డాక్టర్లు అమృత వర్షిణి, కార్తీక్​రెడ్డి, దేవదర్శిణి, అభినయ, స్వర్ణలక్ష్మి, వర్షిణి, షా ఫరీనా, స్కూల్​కరస్పాండెంట్​వెంకట్​నారాయణ్, ఈవెంట్​మేనేజర్​రాధారాం, టీచర్లు ఫజల్​ ఫాతిమా, సుజాత, ఫణిశ్రీ పాల్గొన్నారు.