
బషీర్బాగ్, వెలుగు: అవేర్ గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అవేర్ గ్రూప్ డైరెక్టర్ జనరల్ రాజవర్థన్ రెడ్డి తెలిపారు. బషీర్
బాగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజవర్థన్ రెడ్డి మాట్లాడుతూ... మహేశ్వరంలోని భగవతిపురంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య అతిథిగా జేఎన్టీయూ వైస్ చాన్సలర్ కట్టా నర్సింహరెడ్డి, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. 1975 లో తమ సంస్థను ఏర్పాటు చేశామని, రిటైర్డ్ ఐఏఎస్, సంస్థ వ్యవస్థాపక చైర్మన్ పీకేఎస్ మాధవన్ నేతృత్వంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు.