సన్యాసిగా మారిన ఆర్జీవీ హీరోయిన్.. సడన్‌గా ఎందుకిలా..?

సన్యాసిగా మారిన ఆర్జీవీ హీరోయిన్..  సడన్‌గా ఎందుకిలా..?

పై ఫోటోలో సన్యాసి వేషధారణలో కనిపిస్తున్న ఈమె పేరు  బర్ఖా మదన్.  సుస్మితా సేన్, ఐశ్వర్యా రాయ్ లాంటి అందగత్తెలతో పోటీ పడి  మిస్ ఇండియా ఛాన్స్ మిస్ చేసుకుంది. మోడలింగ్ తరువాత సినిమాల్లోకి వచ్చింది.  అక్షయ్ కుమార్ నటించిన ఖిలాడియోన్ కా ఖిలాడి సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సీరియల్స్‌లో కనిపించింది.   వీటిలో రామ్ గోపాల్ వర్మ తీసిన భూత్  కూడా ఉంది. ఇందులో దెయ్యంగా కనిపించింది. 

సడన్ గా సన్యాసిగా మారి షాక్ ఇచ్చింది. బౌద్ధ సిద్దాంతాల పట్ల ఆకర్షితురాలైన  బర్ఖా మదన్ తన పేరును  గ్యాల్డెన్ సామ్టెన్ గా మార్చుకుంది.  2012లోనే  బౌద్ధమతాన్ని స్వీకరించాలనుకున్న బర్ఖా మదన్ ..  ప్రస్తుతం ద్యానం,  ప్రార్థనలు, పర్వతాలు,  ఆశ్రమాలలో తిరుగుతూ  తన జీవితాన్ని కొనసాగిస్తుంది. బర్ఖా మదన్ తన ఆధ్యాత్మిక విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది.  ఒకప్పుడు ఈమె సినిమాలు చూసినవాళ్లు.. ప్రస్తుతం ఈమె లుక్ చూసి షాకవుతున్నారు.  

బర్ఖా మదన్.. ఒకప్పుడు మోడల్.1994లో మిస్ ఇండియా ఫైనలిస్ట్. అందాల కిరీటం కోసం సుస్మితా సేన్, ఐశ్వర్యరాయ్‌లతో పోటీపడి ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. మిస్ టూరిజం వరల్డ్ వైడ్ రన్నరప్‌గా నిలిచింది.    దలైలామా ఫాలోవర్‌‌గా ఉన్న బర్ఖా మదన్..  2015లో  కర్ణాటకలోని సెరా జే మొనాస్టరీకి చెందిన హార్డాంగ్ ఖాంగ్ట్‌సేన్‌లో బౌద్ధ సన్యాసిగా మారారు.  బర్ఖా సన్యాసినిగా మారడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు ఆమె సన్నిహితులు.