హనుమాన్ భక్తులకు పండ్ల పంపిణీ

హనుమాన్ భక్తులకు పండ్ల పంపిణీ

మద్నూర్, వెలుగు: మద్నూర్ మండలంలోని సలాబత్​పూర్​హనుమాన్ ​టెంపుల్​వరకు పాదయాత్ర చేపట్టిన సుమారు వెయ్యి మంది హనుమాన్​భక్తులకు లచ్చన్​గేట్​వద్ద  మైనార్టీ యువ నాయకులు అజీమ్ పటేల్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు.

హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి ఉండాలని కోరారు. హనుమాన్ సమితికి చెందిన మాజీ సర్పంచ్ రమేశ్​దేశాయ్, అజీమ్ పటేల్ ను శాలువాతో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. శాకాపూర్ గ్రామానికి చెందిన అక్తర్, అబ్జల్, ఉస్మాన్, ముబిన్, అహ్మద్,​ అబ్బు పాల్గొన్నారు.