భక్తులతో మేడారం కిటకిట

భక్తులతో మేడారం కిటకిట

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభానికి నాలుగు రోజులే గడువు ఉండటంతో ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, అమ్మల దర్శనానికి గద్దెల వద్ద బారులు తీరారు. ఇప్పటివరకు 30 లక్షల మంది భక్తులు వన దేవతలను దర్శించుకున్నారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మేడారం ప్రధాన జాతర ఈ నెల 22 నుంచి 24 వరకు జరగనుంది.