
సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశాల సందర్బంగా దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది. విదేశీ ప్రతినిధుల స్వాగతించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఢిల్లీ నగరంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటులు సెలవులు ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ మేరకు బుధవారం (2023 సెప్టెంబర్ 6న) మీడియా సమావేశంలో ప్రకటించారు.
ఢిల్లీలోని భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్లో జీ20 సదస్సు జరగనుంది. సమ్మిట్ను దృష్టిలో ఉంచుకుని విధించిన ఆంక్షలు, ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన నోటిఫికేషన్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.
‘‘మన దేశం జీ20 సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వడం గర్వించదగ్గ విషయం. జీ20 సదస్సు జరిగే ప్రగతి మైదాన్లో గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేసినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నాం.జీ20 సమ్మిట్ కోసం ఢిల్లీ నగరంలో రోడ్లను పునరుద్దరించారు. సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు.. ఢిల్లీ మంత్రి అతిషీ అన్నారు.