
G20 సమ్మిట్ కోసం బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ ఢిల్లీ చేరుకున్నారు. బ్రిటీష్ ప్రధాన మంత్రి అయ్యాక రిషి సునాక్ మొదటిసారి ఇండియాకు వచ్చారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే రిషి సునాక్కు ఘనస్వాగతం పలికారు. అటు సునాక్ బంధువులు కూడా ఆయన్ని ఆహ్వానించేందుకు భారీగా ఎయిర్పోర్టుకు తరలివచ్చారు. రిషి సునాక్కు ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్లో బస ఏర్పాట్లు చేశారు.
ALSO READ :G 20 సమ్మిట్: వసుదైక కుటుంబం థీమ్తో ప్రపంచాన్ని ఏకం చేశాం: భారత్
ఇదిలా ఉంటే ఈ శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంపై రుషి సునాక్ హర్షం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన దేశానికి జీ20 సదస్సు నిర్వహించే అవకాశం వచ్చిందన్నారు. యూకే, భారత్ మధ్య ఉన్న సంబంధం వర్తమానం కంటే రెండు దేశాల భవిష్యత్తును ఎక్కువగా నిర్వచిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
#WATCH | G 20 in India | United Kingdom Prime Minister Rishi Sunak arrives in Delhi for the G 20 Summit.
— ANI (@ANI) September 8, 2023
He was received by MoS for Consumer Affairs, Food and Public Distribution, and Ministry of Environment, Forest and Climate Change Ashwini Kumar Choubey. pic.twitter.com/NIHgQ00P23