
జూన్ 14న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గురువారం (june 12) ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వం 14 ఏళ్ల తర్వాత గద్దర్ అవార్డులను ప్రకటించింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఎఫ్డీసీతో పాటు ఫిలిం ఇండస్ట్రీ, మీడియాపై ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ చేరువ చేయాలని కోరుతున్నా. 2014 నుంచి 2023 వరకు వచ్చిన సినిమాలకు ఏడాదికి మూడు చొప్పున బెస్ట్ ఫిల్మ్ అవార్డులు ఇవ్వబోతున్నాం. ప్రతి బెస్ట్ ఫిల్మ్కి హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా నాలుగు అవార్డులు అందజేయబోతున్నాం.
అలాగే 2024లో వచ్చిన సినిమాల్లోని అన్ని కేటగిరీలకు అవార్డులు అనౌన్స్ చేయగా, వారందరికీ ఇన్విటేషన్స్ ఇప్పటికే పంపించాం. పద్నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎఫ్డీసీ చైర్మన్గా కోరుతున్నా’ అని అన్నారు.3