
ఖైరతాబాద్, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్ ప్రథమ వర్ధంతి సభను ఆగస్టు 6న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు గద్దర్ ఫౌండేషన్ చైర్మన్, గద్దర్ తనయుడు సూర్యకిరణ్ తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ఆయన మీడియాతో మాట్లాడారు. వర్ధంతి సభలో అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, సీపీఐ, సీపీఎం, ఇతర పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారని చెప్పారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్పాశం యాదగిరి, ప్రొఫెసర్ప్రభంజన్యాదవ్, గాయకుడు ఏపూరి సోమయ్య, గాదె ఇన్నయ్య, రాందాసు, ఎల్లయ్య నాయక్, పృథ్వీరాజ్యాదవ్ తదితరులు గద్దర్తో వారికున్న అనుభవాలను పంచుకున్నారు.