- కాంగ్రెస్ టికెట్ ఇస్తే పోటీ చేస్త
- గద్దర్ కూతురు వెన్నెల
ఖైరతాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ అవకాశమిస్తే కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రజాగాయకుడు గద్దర్కూతురు వెన్నెల ప్రకటించారు. తల్లి విమల, మామ నగేష్తో కలిసి శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయని, వానిపై క్లారిటీ ఇచ్చేందుకే మీడియా ముందుకు వచ్చినట్టు చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని 2014లో కాంగ్రెస్ ప్రకటన చేసిందని, అందుకు ఆకర్షితులై ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని దగ్గర్ అనుకున్నారన్నారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేరని, ఆయన రాజకీయ వారసత్వంగా కాంగ్రెస్ నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.
కంటోన్మెంట్లోనే పుట్టి పెరిగాయని, స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్నందున ఇక్కడి నుంచే బరిలోకి దిగాలనుకుంటున్నట్టు చెప్పారు. ఒక వేళ పార్టీ టికెట్ ఇవ్వకున్నా.. పార్టీ గెలుపుకోసం పనిచేస్తానని చెప్పారు. ఇటీవల సోనియా, రాహుల్ కలిసినప్పుడు.. మా కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారని, వారి మాటపై నమ్మకం ఉందన్నారు. గద్దర్ భార్య విమల మాట్లాడుతూ.. టికెట్ ఇస్తామని కాంగ్రెస్నాయకులు చెప్పారని, ఆ మాట ప్రకారం కంటోన్మెంట్ టికెట్ఇస్తే వెన్నెల తప్పకుండా గెలుస్తుందన్నారు.