హైదరాబాద్: ఒమన్కు చెందిన సలామ్ ఎయిర్ డిసెంబర్ 17 నుంచి హైదరాబాద్ టూ మస్కట్కు కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తుందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏల్) సోమవారం ప్రకటించింది. ఓవీ732 విమానం హైదరాబాద్ నుంచి 03.55 గంటలకు బయలుదేరి 06.00 గంటలకు మస్కట్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఓవీ731 విమానం మస్కట్ నుంచి 22.15 గంటలకు బయలుదేరి 02.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని జీహెచ్ఐఏల్ తెలిపింది. ఈ నాన్స్టాప్ ఫ్లైట్ సర్వీస్ ప్రతి మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో బయలుదేరుతుందని పేర్కొంది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ తమ ప్రయాణీకులకు భారీగా సంఖ్యలో సర్వీసులను అందించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటామని, కొత్త విమానయాన సంస్థను సంతోషంగా స్వాగతిస్తున్నామని చెప్పారు.