గాంధీపై రెడ్​క్రాస్​సింబల్స్ ​ఏర్పాటు

గాంధీపై రెడ్​క్రాస్​సింబల్స్ ​ఏర్పాటు

పద్మారావునగర్, వెలుగు: భారత్, పాకిస్తాన్​మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో సికింద్రాబాద్​గాంధీ హస్పిటల్, గాంధీ మెడికల్​కాలేజీల భవనాలపై శనివారం రెడ్​క్రాస్​సింబల్స్​ఏర్పాటు చేశారు. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ సమయంలో ఆస్పత్రులపై దాడులకు పాల్పడకూడదనే నిబంధన ఉంది. 

ఆసుపత్రుల భవనాలను గుర్తించేలా ఇలా టెర్రస్​పైన రెడ్​క్రాస్​సింబల్స్​ఏర్పాటు చేస్తారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం, ఎమర్జెన్సీ, ఓపీ విభాగం, మెడికల్​కాలేజీ భవనాలపై రెడ్​క్రాస్​సింబల్స్​ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.