
సదాశివనగర్, వెలుగు: రామారెడ్డి మండలంలోని పోసానిపేట్ ఆదివారం గ్రామ శివారులో ఐదు గుళ్ల నిర్మాణం కోసం భూమి పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు గండ్ర నర్సింహులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఐదు గుళ్ల నిర్మాణం కోసం దాతుల ముందుకు రావడంతో నిర్మాణ పనులను భూమి పూజ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి, గీరెడ్డి శంకర్ రెడ్డి(అడ్వకెట్), శివ్వారెడ్డి, ఆలయ నిర్మాణ ఉపాధ్యక్షుడు గాండ్ల సాయిలు, కార్యదర్శి శివరాజం పాల్గొన్నారు.