
- రద్దీని తగ్గించడానికి అధికారుల ప్రణాళిక
- చిన్న విగ్రహాలను స్థానికంగానే నిమజ్జనం చేయాలని అధికారుల సూచన
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు, శాంతి భద్రతలకు భంగం కలగకుండా వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న నీటి కొలనులను (బేబీ పాండ్స్)ను అధికారులు ఏర్పాటు చేశారు. అందరూ ట్యాంక్ బండ్కే రాకుండా తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బేబీపాండ్స్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆయా జోన్ల పరిధిలో బేబీ పాండ్స్ సిద్ధం చేసినట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎల్బీనగర్ జోన్ పరిధిలో 4 ప్రాంతాల్లోనూ, చార్మినార్ జోన్ పరిధిలోని 5 ప్రాంతాల్లో, ఖైరతాబాద్ జోన్ పరిధిలోని 6 ప్రాంతాల్లో, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో 3 ప్రాంతాల్లో, కూకట్పల్లి జోన్ పరిధిలో 2 ప్రాంతాల్లో, సికింద్రాబాద్ జోన్ పరిధిలో3 ప్రాంతాల్లో బేబీ పాండ్స్ ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో బేబీ పాండ్స్తో పాటు, పోర్టబుల్ వాటర్ ట్యాంక్స్, తాత్కాలికంగా గుంతలు తవ్వి నీటి కొలనులుగా రూపొందించినట్టుఅధికారులు తెలిపారు.