రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లో గణేషుడి లడ్డూ రికార్డ్ ధర పలికింది. రిచ్ మండ్ విల్లాలో ఏర్పాటుచేసిన వేలంపాటలో వినాయకుడి లడ్డూ కోటి 25 లక్షల రూపాయలు పలికింది. రాష్ట్ర చరిత్రలో గణేశ్ లడ్డూకు ఇంత ధర పలకడం ఇదే ప్రథమం. గతేడాది ఇక్కడి లడ్డు వేలంలో రూ. 60 లక్షల 80 వేలు పలికింది. ఇక మైహోమ్ భుజాలోని గణేశుని లడ్డూని రూ.25 లక్షల 50 వేలకు చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి దక్కించుకున్నారు. గతేడాది కంటే రూ.7 లక్షలు అధికంగా ధర పలికింది. 2022లో రూ.18.50 లక్షలు పలికిన విషయం తెలిసిందే.
ఇక మరికాసేపట్లో బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం పాట జరగనుంది. ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్ లడ్డూ వేలంపై యావత్ తెలుగు ప్రజల ఫోకస్ ఉంటుంది. . బాలాపూర్ వినాయకుడికి 43 ఏళ్ల చరిత్ర ఉంది. 2022లో వంగేటి లక్షారెడ్డి 24 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. ఈ సారి రూ. 25 లక్షల ధర పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.