బాలికను గొడ్లచావిడికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్

బాలికను గొడ్లచావిడికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్

కృష్ణా జిల్లా: 14 ఏళ్ల బాలికకు ఓ యువకుడు  మాయ మాటలు చెప్పి గొడ్డ చావిడికి తీసుకెళ్లి.. అక్కడ రెడీగా ఉన్న మరో ఇద్దరితో కలసి గ్యాంగ్ రేప్ చేశారు. కృష్ణా జిల్లాలో జరిగిన దారుణ ఘటన బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. 
బాలికపై కన్నేసిన యువకులు ఒంటరిగా ఉన్న సమయంలో మాయ మాటలు చెప్పి గొడ్ల చావిడికి తీసుకెళ్లారు. అక్కడ మరో ఇద్దరు యువకులు కాచుకుని ఉన్నారు. ముగ్గురు కలసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. బాలిక కనిపించకపోవంతో వెతుకుతూ వెళ్లిన తండ్రి జరిగిన ఘోరం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.