రైల్వే స్టేషన్ భూమి పూజను విజయవంతం చేయాలి : గంగాటి మోహన్ రెడ్డి

రైల్వే స్టేషన్ భూమి పూజను విజయవంతం చేయాలి : గంగాటి మోహన్ రెడ్డి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి రైల్వే స్టేషన్ భూమి పూజ కార్యక్రమానికి స్థానికులు, ప్రజాపతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాటి మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్​హాల్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషి చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, గవర్నర్ తమిళసై, కేంద్ర రైల్వే శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మల్లన్న భక్తులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కళ సాకారమైందన్నారు.

.గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధిని విస్మరించిందని, ఈ ప్రభుత్వమైన ఆలయాన్ని అభివృద్ధి చేస్తుందా లేదా అనేది కొంత కాలం వేచి చూడాలన్నారు. అనంతరం బీఆర్ఎస్ కు చెందిన మెరుగు శరత్ బాబు, కిరణ్ కుమార్ బీజేపీలో చేరగా వారికి కండువా కప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేశ్, లక్ష్మారెడ్డి, వెంకటరెడ్డి, కర్నాకర్, కార్యకర్తలు పాల్గొన్నారు.