
పద్మారావునగర్, వెలుగు: నగరంలో హాష్ ఆయిల్, గంజాయి విక్రయిస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.6.50 లక్షల విలువైన హాష్ ఆయిల్, గంజాయి, చరాస్, రెండు డాగర్లు, మూడు బైక్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ సుదీంద్ర బుదవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, మాసబ్ ట్యాంక్ పోలీసులు మాసబ్ ట్యాంక్ పింఛన్ ఆఫీస్ బస్ స్టాప్ సమీపంలో దాడులు నిర్వహించారు. సయ్యద్ ముర్తుజా అలీ హుస్సేన్, మహమ్మద్ ఫైజాన్, హర్షిత, సమీర్ అనే నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. గాజులరామారంలో నివసించే సామ్ అజయ్, వీరచారిని కూడా అరెస్టు చేశారు. నాగపూర్ నుంచి సరుకు తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.