నార్సింగిలో గంజాయి చాక్లెట్ల కలకలం..

నార్సింగిలో గంజాయి చాక్లెట్ల కలకలం..

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. కోకపెట్ రాంకీ కనస్ట్రక్షన్ కంపెనీ దగ్గర అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఒడిస్సాకు చెందిన సోమ్యా రాజన్ నుంచి వివిధ బ్రాండ్లకు సంబంధించిన 40 గంజాయి చాకెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ అపార్టుమెంట్ లో కార్మికులకు అమ్ముతుండగా ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు  సోమ్యా రాజన్ పట్టుకుని అరెస్టు చేశారు.

సోమ్య రాజన్ ఒడిస్సా నుంచి హైదరాబాదుకు ఉపాధి కోసం వచ్చి గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నట్లు గుర్తించారు. ఖమ్మం జిల్లా వరంగల్ క్రాస్ రోడ్డులో భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో తనిఖీలు నిర్వహించారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పొలీసులు. ఔరంగబాద్ కు చెందిన ఇద్దరు మహిళల నుంచి ఎనిమిది కిలోల గంజాయి..మూడు కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేశారు పోలీసులు.