హైదరాబాద్, వెలుగు: గట్టు ఎత్తిపోతల కెపాసిటీని పెంచేందుకు స్టేట్లెవెల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 1.3 టీఎంసీల సామర్థ్యం ఉన్న గట్టు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచేందుకు ఎస్ఎల్ఎస్సీ ఓకే చెప్పింది. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన ఎస్ఎల్ఎస్సీ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మొత్తం 20 అంశాల ఎజెండాపై సమావేశం నిర్వహించగా.. అందులో సగం వరకు అంశాలపై ఎస్ఎల్ఎస్సీలో చర్చించారు.10 అంశాలకు ఆమోదం తెలుపగా.. అందులో ఆరు ఎక్స్టెన్షన్ఆఫ్టెండర్స్, నాలుగు వేరియేషన్ ఎస్టిమేట్స్ ఉన్నట్టు తెలిసింది.
దేవాదుల లిఫ్ట్ స్కీమ్ ఫేజ్–3, కాళేశ్వరం ఎలక్ట్రో మెకానికల్వర్క్స్ఈవోటీలకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. దీంతో పాటు పాలమూరు రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టులపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. ఇక, అంతకుముందు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన 105 పనులపై ఓ అండ్ఎం కమిటీ మీటింగ్నిర్వహించారు. అందులో వందకుపైగా పనులకు ఆమోదం తెలిపారు.
