ముంబై: వరుసగా రెండో రోజూ అదానీ గ్రూప్ స్టాక్స్ లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 13.49 శాతం లాభపడింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అదానీ గ్రూపు గురించి సానుకూలంగా రిపోర్ట్ ఇవ్వడంతో ఈ గ్రూపు షేర్లకు గిరాకీ తగ్గడం లేదు. గ్లోబల్ మార్కెట్లలో బలహీనమైన పోకడల కారణంగా మంగళవారం సెన్సెక్స్, నిఫ్టీలు కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకున్నాయి. 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రా-డే హై లెవెల్ నుండి 18.11 పాయింట్లు పెరిగి 61,981.79 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 281.51 పాయింట్లు 62,245.19 వద్దకు చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 33.60 పాయింట్లు పెరిగి 18,348 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ కంపెనీల్లో బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ , టాటా స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, మారుతీలు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ లార్సెన్ & టూబ్రోలు వెనుకబడ్డాయి. కొన్ని ఐటీ స్టాక్స్లో విపరీతంగా ప్రాఫిట్-బుకింగ్ కనిపించిందని కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ చెప్పారు. బ్రాడ్ మార్కెట్లో బీఎస్ఈ మిడ్క్యాప్ గేజ్ 0.43 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.11 శాతం లాభపడ్డాయి. సూచీలలో యుటిలిటీస్ 1.37 శాతం, పవర్ 1.18 శాతం, ఆయిల్ & గ్యాస్ (0.92 శాతం), కమోడిటీలు (0.91 శాతం), ఎనర్జీ (0.66 శాతం) పెరిగాయి. పరిశ్రమలు, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, టెక్, రియల్టీ రంగాలు వెనుకబడ్డాయి. ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై హాంకాంగ్ దిగువన స్థిరపడగా, సియోల్ గ్రీన్లో ముగిసింది. యూరప్ మార్కెట్లు నెగటివ్గా ట్రేడవుతున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్ లాభాలతో ముగిసింది. ఎఫ్ఐఐలు సోమవారం రూ. 922.89 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా, గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 0.03 శాతం తగ్గి 75.97 డాలర్లకు చేరుకుంది. డాలర్తో పోలిస్తే రూపాయి రెండు పైసలు పెరిగి 82.82 వద్ద క్లోజయింది.