2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ టైటిల్ గెలిచిన గాయత్రి భరద్వాజ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా గాయత్రి మాట్లాడుతూ ‘ఢిల్లీలో పుట్టిపెరిగాను. మా నాన్న పైలెట్, అమ్మ సైకాలజిస్ట్.
సినిమా బ్యాగ్రౌండ్ లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ వరల్డ్లో ఫేమస్ అవ్వాలని ఉండేది. హిందీలో రెండు వెబ్ సిరీసులు చేశాను. అదే టైమ్లో డైరెక్టర్ వంశీ స్టోరీ చెప్పారు. నా పాత్ర గురించి చెప్పినప్పుడే కన్నీ ళ్లు వచ్చేశాయి. నాది చాలా ఎమోషనల్గా ఉండే పోర్షన్. నా పాత్ర కోసం దాదాపు అరవై మందిని ఆడిషన్స్ చేశారట. నేను యాప్ట్ అవడం, అందులోనూ రవితేజ గారితో నటించడం ఆనందంగా ఉంది.
నా పాత్ర పేరు మణి. విలేజ్ బ్యాక్డ్రాప్లో రా అండ్ రస్టిక్గా కనిపిస్తా. పీరియాడికల్ బ్యాక్డ్రాప్ కావడంతో లుక్ పరంగా చాలా కేర్ తీసుకున్నా. రవితేజ గారి పాత్ర చాలా ఎనర్జిటిక్గా ఉంటుంది. దేశమంతా చర్చించుకునే స్ట్రాంగ్ దొంగ క్యారెక్టర్ ఆయనిది. ఎవరూ ఊహించని హై ఎనర్జీ, యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. వంశీ ఈ కథ కోసం మూడేళ్లు రీసెర్చ్ చేయడం గ్రేట్. అలాగే అభిషేక్ అగర్వాల్ డేరింగ్ ప్రొడ్యూసర్. టాప్ క్లాస్ వీఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ఆస్కార్ చిత్రాన్ని ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీలో పార్ట్ అవడం గర్వంగా ఉంది. నా ఫేవరేట్ హీరో రామ్ చరణ్. తెలుగులో మరో ప్రాజెక్ట్ చేస్తున్నా. త్వరలోనే అనౌన్స్మెంట్ వస్తుంది’ అని చెప్పింది.