టీఆర్ఎస్‌ను గెలిపిస్తే హుజురాబా‌ద్‌కు మెడికల్ కాలేజీ తీసుకొస్తా

టీఆర్ఎస్‌ను గెలిపిస్తే హుజురాబా‌ద్‌కు మెడికల్ కాలేజీ తీసుకొస్తా

హుజురాబాద్ లో టీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేసింది. పలు ప్రాంతాల్లో గెల్లు శ్రీనివాస్ రోడ్ షోలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ పాల్గొన్నారు. హుజురాబాద్ ప్రజలకు సేవ చేయలేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఈటల రాజేందర్ అని గెల్లు శ్రీనివాస్ విమర్శించారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.. టీఆర్ఎస్ ను గెలిపిస్తే.. హుజురాబాద్ కు మెడికల్ కాలేజీ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఆస్తులు కాపాడుకోవడం కోసమే ఈటల రాజేందర్ బీజేపీలో చేరాడని వినోద్ విమర్శించారు.. ఆత్మగౌరవం అంటూ ఈటల రాజేందర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు వినోద్ కుమార్.

see more news

టీఆర్ఎస్ జెండాను డాగ్‌స్క్వాడ్‌తో ఊరంతా వెతికిన పోలీసులు

ఈటలకు మద్దతు ప్రకటించిన తీన్మార్ మల్లన్న టీం