హైదరాబాద్, వెలుగు: మనదేశంలోని భూగర్భ ఉష్ణ శక్తి (జియో థర్మల్) ద్వారా భారీగా ఇండస్ట్రియల్ హీట్, కూలింగ్, విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని ప్రాజెక్ట్ ఇన్నర్ స్పేస్.. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) వెల్లడించాయి. వీటి స్టడీ ప్రకారం.. ప్రకారం భారత్లో 11 వేల గిగావాట్ల ఇండస్ట్రియల్ హీట్, 1,500 గిగావాట్ల కూలింగ్, 450 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.
ఈ శక్తి వినియోగం వల్ల దేశీయ విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది. లక్షలాది ఉద్యోగాలూ వస్తాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు జియోథర్మల్ విస్తరణకు అనువైన ప్రాంతాలుగా గుర్తించారు.
