- ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్
హైదరాబాద్, వెలుగు: రూపాయి పతనం వల్ల ధరలను పెంచాల్సి రావొచ్చని జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తెలిపింది. మన కరెన్సీ గతేడాది 19 శాతం వరకు తగ్గిందని కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ (ఇండియా) బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఆడి షోరూమ్ను శుక్రవారం ప్రారంభించాక ఆయన విలేకరులతో మాట్లాడారు. రూపాయి విలువ తగ్గడంతో పెరిగిన వ్యయాన్ని కొంత వరకు సంస్థ భరిస్తోందని అన్నారు. రాబోయే నెలల్లో కొంత భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయాల్సి రావొచ్చని పేర్కొన్నారు. ‘‘దేశవ్యాప్తంగా మాకు 30 షోరూమ్లు, 67 టచ్ పాయింట్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆడికి ఏడు షోరూమ్లు ఉన్నాయి. చిన్న పట్టణాల పైనా దృష్టి పెడుతున్నాం. వచ్చే నెల కొత్త స్పోర్ట్స్ కారును తీసుకొస్తాం. యూరప్తో ఇండియా ట్రేడ్ వల్ల లగ్జరీ కార్ల ధరలు తగ్గుతాయని భావిస్తున్నప్పటికీ, ఇది అమల్లోకి రావడానికి చాలా సమయం పట్టవచ్చు” అని ఆయన వివరించారు.
