జర్మనీ లో 12 ఏళ్లు దాటిన పిల్లలకు వ్యాక్సిన్ 

జర్మనీ లో 12 ఏళ్లు దాటిన పిల్లలకు వ్యాక్సిన్ 

కరోనాను అరికట్టడానికి జర్మనీ మరో నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు కూడా క‌రోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించింది. జూన్ 7వ తేదీ నుంచి టీకాలు ఇస్తామని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తెలిపారు. అయితే.. పిల్లలకు క‌రోనా టీకాలు తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. న్యూ అకాడమిక్ ఇయర్ కు ముందు.. ఆగస్టు వరకు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు ఇవ్వాలని నిర్ణయించారు. పిల్లలకు టీకాలు వేయడం ద్వారా వారిలో రోగనిరోధకశక్తి పెరుగుతుందని చెప్పారు. జూన్ 7వ తేదీ నుంచి 12, అంత‌కు పైబ‌డిన పిల్లలు లేదా యువ‌త టీకాల కోసం నమోదు చేసుకోవచ్చని మెర్కెల్ తెలిపారు.