మేడిపల్లి, వెలుగు : చెంగిచర్ల ఘటనలో ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డితోపాటు మరో నలుగురు బీజేపీ నాయకులను మేడిపల్లి పోలీసులు శనివారం అరెస్ట్చేశారు. హోలీ పండుగ రోజు చెంగిచర్ల పిట్టల బస్తీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వారిని ఇటీవల పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ బండి సంజయ్, బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు పోలీసులను, బారికేడ్లను నెట్టివేశారు.
తమ విధులకు ఆటంకం కలిగించమే కాకుండా, తమను గాయపరిచారని నాచారం సీఐ నందీశ్వర్రెడ్డి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఈ ఘటనలో శనివారం ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డితోపాటు మరో నలుగురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్చేసి రిమాండుకు తరలించారు.