ఘట్​కేసర్ ​ఎంపీపీ అరెస్ట్

ఘట్​కేసర్ ​ఎంపీపీ అరెస్ట్

మేడిపల్లి, వెలుగు :  చెంగిచర్ల ఘటనలో ఘట్​కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డితోపాటు మరో నలుగురు బీజేపీ నాయకులను మేడిపల్లి పోలీసులు శనివారం అరెస్ట్​చేశారు. హోలీ పండుగ రోజు చెంగిచర్ల పిట్టల బస్తీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వారిని ఇటీవల పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ బండి సంజయ్, బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు పోలీసులను, బారికేడ్లను నెట్టివేశారు. 

తమ విధులకు ఆటంకం కలిగించమే కాకుండా, తమను గాయపరిచారని నాచారం సీఐ నందీశ్వర్​రెడ్డి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఈ ఘటనలో శనివారం ఘట్​కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డితోపాటు మరో నలుగురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్​చేసి రిమాండుకు తరలించారు.