డబుల్ బెడ్ రూం ఇళ్ళ అంశం ప్రాతిపదికనే GHMC ఎన్నికలు

డబుల్ బెడ్ రూం ఇళ్ళ అంశం ప్రాతిపదికనే GHMC ఎన్నికలు

డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఎన్ని ఎక్కువ పంపిణీ చేస్తే.. బీజేపీకి అంత ఎక్కువ లాభమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇళ్ళు వచ్చిన వారి కంటే రాని వారికే ఎక్కువ కడుపు మంటగా ఉంటుందన్నారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కిషన్ రెడ్డి… డబుల్ బెడ్ రూం ఇళ్ళ అంశం ప్రాతిపదికనే GHMC ఎన్నికలు జరగనున్నాయన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళు, కరోనా, హైదరాబాద్ వరదలు.. అన్నిటిల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫియల్ అయ్యిందన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలుస్తోందనటానికి మంత్రి హరీష్ రావు ఫ్రస్టేషనే ఉదాహరణ అన్నారు. దుబ్బాకలో నిరుద్యోగులు బీజేపీకి ప్రచారం చేయటాన్ని హరీష్ రావు తట్టుకోలేకపోతున్నారన్నారు.

GHMC ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీచేసే అంశంపై పార్టీలో చర్చ జరగలేదన్నారు కిషన్ రెడ్డి. దుబ్బాకలో పవన్ కల్యాణ్ ప్రచారం‌ చేసే విషయంలో స్పష్టత లేదన్నారు. CMRFకు విరాళాలవ్వాలని ముఖ్యమంత్రే వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి అడుగుతున్నారని ఆరోపించారు. విరాళాలు ఇవ్వాలని సినీ నటులను మంత్రి తలసాని‌ అడిగనందునే .. నాయకులు కూడా విరాళాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ అన్నారని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రనికి త్వరలో  విపత్తు నిధులొస్తాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.