తలసానికి షాక్.. రూ.5వేలు కట్టాలంటూ నోటీసులు

తలసానికి షాక్.. రూ.5వేలు కట్టాలంటూ నోటీసులు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు షాక్ తగిలింది. ఫ్రిబవరి 17న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జరగనున్నాయి. అయితే కేసీఆర్ జన్మదినం సందర్భంగా విష్ చేస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై జీహెచ్ఎంసీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలుపుతూ రూ.5వేల జరిమానా విధించారు. రూ.5 వేలు చెల్లించాలంటూ తలసానికి నోటీసులు పంపారు.