బాలికపై అత్యాచారం

బాలికపై అత్యాచారం

జీడిమెట్ల, వెలుగు: బాలికపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన  హైదరాబాద్​ జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన పి. సంజయ్ కుమార్(32) డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 

స్థానికంగా ఉండే ఓ బాలిక(13)కు మాయమాటలు చెప్పి రెండ్రోజులు అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పోలీసులకు కంప్లయింట్ చేశారు. సంజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు.