స్కూల్​ బస్సు ఢీ కొని.. బాలిక మృతి

స్కూల్​ బస్సు ఢీ కొని.. బాలిక మృతి

ప్రైవేటు పాఠశాల బస్సు ఢీ కొని ఓ బాలిక మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల పోలీస్​స్టేషన్ పరిధిలోని నాదర్గుల్​లో  భావన(5) తల్లిదండ్రులతో నివసిస్తోంది. రాజీవ్​ గృహకల్ప కాలనీలో ని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్​ భావనను గమనించకుండా ఆమె పై నుంచి బస్సును తీసుకెళ్లాడు. 

దీంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.