హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ, కార్పొరేషన్ల అధికారులు.. అధికార పార్టీ నేతలకు ఫేవర్స్ చెయ్యడం దురదృష్టకరమని రిటైర్డ్ ఐఏఎస్ఆకునూరి మురళి మండిపడ్డారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి తీసుకున్న అప్పు రూ.45 కోట్లు కట్టాలంటూ ఫైనాన్స్ కార్పొరేషన్, రూ.7 కోట్ల లీజు డబ్బులు కట్టాలంటూ ఆర్టీసీ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఉద్దేశిస్తూ ఆకునూరి మురళి ట్వీట్ చేశారు.
‘‘ప్రభుత్వ, కార్పొరేషన్ల అధికారులు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు ఇట్లా ఫేవర్లు చేయడం దురదృష్టకరం. రాజకీయ నాయకులు అధికారం దుర్వినియోగం చెయ్యడం సిగ్గుచేటు. కొత్త ప్రభుత్వం ఇలాంటి విషయాలపై సరైన విధానం తీసుకురావాలి’’ అని పేర్కొన్నారు.