జీవన్​ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆకునూరి మురళి ట్వీట్​

జీవన్​ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆకునూరి మురళి ట్వీట్​

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ, కార్పొరేషన్ల అధికారులు.. అధికార పార్టీ నేతలకు ఫేవర్స్​ చెయ్యడం దురదృష్టకరమని రిటైర్డ్​ ఐఏఎస్​ఆకునూరి మురళి మండిపడ్డారు. బీఆర్ఎస్ ​మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి తీసుకున్న అప్పు రూ.45 కోట్లు కట్టాలంటూ ఫైనాన్స్​ కార్పొరేషన్, రూ.7 కోట్ల లీజు డబ్బులు కట్టాలంటూ ఆర్టీసీ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఉద్దేశిస్తూ ఆకునూరి మురళి ట్వీట్​ చేశారు.

‘‘ప్రభుత్వ, కార్పొరేషన్ల అధికారులు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు ఇట్లా ఫేవర్లు చేయడం దురదృష్టకరం. రాజకీయ నాయకులు అధికారం దుర్వినియోగం చెయ్యడం సిగ్గుచేటు. కొత్త ప్రభుత్వం ఇలాంటి విషయాలపై సరైన విధానం తీసుకురావాలి’’ అని పేర్కొన్నారు.