
ఎల్బీనగర్, వెలుగు: క్రిటికల్ మినరల్స్కు ప్రపంచవ్యాప్తంగా పోటీ ఉందని, భారత్కు భవిష్యత్తులో మరింత అవసరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. నాగోల్ బండ్లగూడలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సోమవారం జరిగిన ‘నెక్స్ట్ జనరేషన్ జియో ఫిజిక్స్ 2025’ సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రెండు నూతన హైడ్రాలిక్ బోర్ వెహికిల్స్ను ప్రారంభించారు. ప్రస్తుతం క్రిటికల్ మినరల్స్ కోసం100 శాతం ఇతర దేశాలపై ఆధారపడుతున్నామని, అందువల్లే ప్రధాని మోదీ నాయకత్వంలో క్రిటికల్ మినరల్ మిషన్ రూపొందించినట్లు చెప్పారు. దేశంలో క్రిటికల్ మినరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మైనింగ్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నామన్నారు.
అదే స్థాయిలో క్రిటికల్ మినరల్స్ కోసం ఇతర దేశాలతో ఎంఓయూలు చేసుకుంటున్నట్లు చెప్పారు. లిథియం, కోబాల్ట్ వంటి ఖనిజాల కోసం అర్జెంటీనా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాలను చేరేందుకు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తూ ఎనర్జీ సెక్యూరిటీని పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కిషన్రెడ్డి వివరించారు.