వైభవంగా కొమురవెల్లి మల్లన్న పెద్ద పట్నం

 వైభవంగా కొమురవెల్లి మల్లన్న పెద్ద పట్నం

సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పెద్దపట్నం కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌ ఒగ్గు పూజారుల సంఘం ఆధ్వర్యంలో భక్తులు మల్లన్న క్షేత్రంలోని కల్యాణకట్ట  వద్ద సోమవారం పెద్దపట్నం వేసి అగ్నిగుండం తయారు చేశారు.

స్వామి వారి పట్నం వారానికి వచ్చిన భక్తులు... పెద్ద పట్నం, అగ్నిగుండం దాటి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అనంతరం నల్లపోచమ్మ, కొండపోచమ్మ ఆలయాలకు వెళ్లి అక్కడ అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు భారీగా సంఖ్యలో తరలిరావడంతో ఉత్సవాల్లో ఎలాంటి అవంఛానీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.