హైదరాబాద్​ ఎయిర్​పోర్టులో కొత్త కార్గో ఫెసిలిటీ

హైదరాబాద్​ ఎయిర్​పోర్టులో కొత్త కార్గో ఫెసిలిటీ

హైదరాబాద్, వెలుగు: జీఎంఆర్​ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్​ఏసీ),  అంతర్జాతీయ కొరియర్,  ఎక్స్‌‌‌‌ప్రెస్ కార్గో సరుకుల రవాణాకు కొత్త ఫెసిలిటీని ప్రారంభించినట్లు ప్రకటించింది. హైదరాబాద్ ఎయిర్​పోర్టులో ఇదివరకే  ప్రపంచ స్థాయి ఎయిర్ కార్గో టెర్మినల్‌‌ ఉంది. సరుకుల నిర్వహణకు కస్టమ్స్ డిపార్ట్​మెంట్​ ఆమోదిత ప్రత్యేకమైన అంతర్జాతీయ కొరియర్ ఫెసిలిటీ కావాలని గుర్తించి దీనిని ఏర్పాటు చేశామని జీహెచ్​ఏసీ ప్రకటించింది. ఫెసిలిటీ ప్రారంభ కార్యక్రమంలో కస్టమ్స్ చీఫ్ కమిషనర్  బివి శివ నాగ కుమారి,  జీఎంఆర్​ ఎయిర్​పోర్ట్స్​ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్- ఎస్‌‌జికె కిషోర్, సీఈఓ  ప్రదీప్ పణికర్ తదితరులు పాల్గొన్నారు. జీహెచ్​ఏసీ టెర్మినల్ సమీపంలోని ఈ ఫెసిలిటీ కొరియర్, కార్గో షిప్‌‌మెంట్ల ఎగుమతులకు, దిగుమతులకు కీలకంగా మారుతుంది. ఇది ఇండియన్ కస్టమ్స్  ఎక్స్‌‌ప్రెస్ కార్గో క్లియరెన్స్ సిస్టమ్ తో లింక్​ అయి ఉంటుంది. దీని వల్ల టెర్మినల్ వద్ద కొరియర్ కన్​సైన్‌‌మెంట్ ప్రాసెసింగ్, క్లియరెన్స్‌‌ ఎలాంటి ఆటంకాలూ లేకుండా, తొందరగా జరుగుతుంది.