గాంధీ భారతమా? గాడ్సే భారతమా?

గాంధీ భారతమా? గాడ్సే భారతమా?
  • ప్రధాని క్లారిటీ ఇవ్వాలి: అసదుద్దీన్ ఒవైసీ

మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను దేశ భక్తుడంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కామెంట్ చేయడం ఇదే తొలిసారి కాదని అన్నారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. ఆమె గాంధీజీ శత్రువు అని, ఆయన హంతకులకు సపోర్టర్ అని దీనిబట్టి అర్థమవుతోందన్నారు. నిన్న లోక్‌సభలో ప్రజ్ఞా సింగ్ చేసిన కామెంట్స్‌పై స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చానని చెప్పారు. మరో ఎంపీ మాట్లాడుతుండగా ఆమె అడ్డుకుని మరీ గాడ్సే దేశభక్తుడన్న వ్యాఖ్యలు చేసి సభను అడ్డుకున్న తీరుపై సభాహక్కుల నోటీస్ ఇచ్చానని తెలిపారు ఒవైసీ. దీనిపై స్పీకర్, ప్రధాని చర్యలు తీసుకుంటారో లేదో చూడాలని అన్నారు.

MORE NEWS:

గాంధీని చంపిన గాడ్సేపై సాధ్వి ప్రజ్ఞ సంచలన వ్యాఖ్యలు

గాడ్సే దేశ భక్తుడన్న ప్రజ్ఞా సింగ్‌పై బీజేపీ వేటు

మంగళవారం రాజ్యంగ దినోత్సవం జరిపారని, ఆ తర్వాతి రోజే బీజేపీ ఎంపీ గాడ్సేను దేశ భక్తుడని చెప్పడం సిగ్గుచేటని అన్నారు ఒవైసీ. దేశంలో తొలి టెర్రరిస్ట్ అయిన గాడ్సేను దేశభక్తుడని చెప్పి ప్రజ్ఞా సింగ్ పార్లమెంటును అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మన దేశం గాంధీ భారతమా? లేక గాడ్సే భారతమా అన్నది ప్రధానమంత్రి వివరణ ఇవ్వాలని అన్నారు ఒవైసీ.