షాద్నగర్, వెలుగు: మహిళ పుస్తెల తాడును స్నాచర్ లాక్కెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని అల్వాల్ శివారులో జరిగింది. తులవానిగడ్డ గ్రామానికి చెందిన జువ్వు శ్రీలత సోమవారం తన పొలంలో పశువులు మేపుతోంది. మధ్యాహ్నం 3.45 నిమిషాల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వచ్చి ఆమె మెడలోని 4 తులాల పుస్తెలతాడును లాక్కొని పారిపోయాడు. శ్రీలత వెంటనే తేరుకొని చూసేలోపు పారి పోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి బాధితురాలి వద్దకు వెళ్లి చోరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని సూచించారు.
మహిళ పుస్తెల తాడు తెంపుకెళ్లిండు
- క్రైమ్
- August 8, 2023
లేటెస్ట్
- విశ్వనాథపల్లి పీహెచ్సీకి కుర్చీల వితరణ
- నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ : పమేలా సత్పతి
- మధిర కోర్టును తనిఖీ చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
- అయ్యప్ప సన్నిధిలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు
- మల్లాపూర్ తహసీల్ ఎదుట గ్రామస్తుల ఆందోళన
- ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
- పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అడ్లూరి
- ఎమ్మెల్సీ ఎన్నికకు జంబో బ్యాలెట్..బరిలో 52 మంది అభ్యర్థులు
- బీరప్ప ఉత్సవాల్లో ఎమ్మెల్యే పూజలు
- హైవే విస్తరణ పనులు వేగవంతం చేయాలి : ఉదయ్ కుమార్
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?