ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ .. బంగారం డిమాండ్ జూమ్​

ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ .. బంగారం డిమాండ్ జూమ్​
  • 8 శాతం పెరిగి 136 టన్నులకు చేరింది 

న్యూఢిల్లీ: ధరలు పెరుగుతూనే ఉన్నప్పటికీ, మార్చి క్వార్టర్​లో బంగారం డిమాండ్ ఎనిమిది శాతం పెరిగి 136 టన్నులకు చేరుకుంది. ఏడాది క్రితం 126 టన్నులు డిమాండ్​ నమోదయింది. ఫిబ్రవరిలో ధరలు ఆకస్మికంగా పడిపోవడంతో డిమాండ్​ విపరీతంగా పెరిగింది. విలువ పరంగా ఇది 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు (గత ఏడాది రూ.63,090 కోట్లు) చేరింది. నగల డిమాండ్ 4 శాతం పెరిగి 95.5 టన్నులకు (91.9 టన్నులు) ఉండగా, పెట్టుబడి 19 శాతం పెరిగి 41 టన్నులకు (34 టన్నులు) చేరుకుంది.

 వరల్డ్​ గోల్డ్ కౌన్సిల్ ఇండియా ప్రాంతీయ సీఈఓ సచిన్ జైన్ మాట్లాడుతూ, పెరుగుతున్న సంపదతో, భారతదేశం బంగారు ఆభరణాలకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ కొనసాగుతోందని అన్నారు. ఈ  క్వార్టర్​ చివరిలో అధిక ధరలు ఉన్నప్పటికీ పెట్టుబడులు పెరిగాయని అన్నారు.  గోల్డ్ ఎక్స్ఛేంజ్ -ట్రేడెడ్ ఫండ్స్ వంటి గోల్డ్ బ్యాక్డ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లకు ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్​ కొనసాగుతున్నదని ఎనలిస్టులు చెబుతున్నారు.