శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. మొత్తం 4కోట్లకు పైగా విలువ గల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్కి వచ్చిన ఇద్దరు  ప్రయాణికుల వద్ద 2800 గ్రాములు బంగారాన్ని పట్టుకున్నారు. దాన్ని విలువ కోటీ 47లక్షల 28వేలు ఉంటుందని తెలిపారు. 

మరో వ్యక్తి దగ్గర 4895 గ్రాముల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దీన్ని విలువ 2 కోట్ల 57 లక్షలు 47 వేలు ఉంటుందని చెప్పారు. మొత్తం సీజ్ బంగారం విలువ 4కోట్లకు పైగా ఉంటుందన్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.