శంషాబాద్, వెలుగు: దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఇండిగో విమానంలో వచ్చిన వ్యక్తి అక్రమంగా బంగారాన్ని తీసుకురావడంతో కస్టమ్స్ అధికారులు అతడిని పట్టుకున్నారు. బంగారాన్ని మిక్సీలోని దాచిపెట్టి తెస్తుండగా తనిఖీల్లో దొరికాడు.
అక్రమంగా తీసుకొస్తున్న బంగారం విలువ రూ. 49.79 లక్షల ఉంటుందని ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.